Thursday, 17 July 2025

sri krishna god biography: శ్రీ కృష్ణుని గురుంచి ఆసక్తికరమైన విషయాలు గురుంచి చాల మందికి తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.



🎕    శ్రీ కృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించారు. 

🎕    శ్రీ కృష్ణుడు పుట్టిన తేదీ 21-07-3228

🎕    మాసం : శ్రవణం 

🎕    తిధి :    అష్టమి 

🎕    నక్షత్రం :    రోహిణి 

🎕    వారం :    బుధవారం 

🎕    శ్రీ కృష్ణుని జీవితకాలం : 125 సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు 

🎕    శ్రీ కృష్ణుని మరణము : 18-02-3102

🎕    శ్రీ కృష్ణుని 89 వ యేటా కురుక్షేత్రం జరిగినది 

🎕    శ్రీ కృష్ణుడు కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాలు తరువాత శ్రీ కృష్ణుడు మరణించెను 

🎕    కురుక్షేత్రం 8-12-3139 మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25-12-3139 రోజున ముగిసింది.         21-12-3139 న సుమారు 3 గంటల నుండి 5 గంటల వరకు సంభవించిన సూర్య గ్రహణం                    జయద్రదుని మరణానికి కారణమైయెను. 

🎕    భీష్ముడు 2-2-3138 న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణము విడిచెను. 


శ్రీ కృష్ణుని కుటుంబము:

🎕    శ్రీ కృష్ణునికి జన్మనించిన తండ్రి పేరు వసుదేవుడు 

🎕    శ్రీ కృష్ణునికి జన్మనించిన తల్లి దేవకీ 

🎕    శ్రీ కృషునిని పెంచిన తండ్రి నందుడు 

🎕    శ్రీ కృష్ణుని పెంచిన తల్లి యశోద 

🎕    శ్రీ కృష్ణుని సోదరుడు బలరాముడు 

🎕    శ్రీ కృష్ణుని సోదరి సుభద్ర 

🎕    శ్రీ కృష్ణుని జన్మస్దలము మధుర 

🎕    శ్రీ కృష్ణుని భార్యలు : రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళిందీ, మిత్రమింద, నగ్నజితి, భద్ర,లక్ష్మణ 

🎕    శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం వారు            ఎవరంటే. 

🎕    చణురా - కుస్తీదార 

🎕    కంసుడు -   మేనమామ 

🎕    శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త  కొడుకులు 

🎕    హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు వారిలో అత్యంత ప్రసిది గాంచిన దేవుడైన             శ్రీ  కృషుని గురుంచి మనలో అనేక మందికి తెలుసు. అయినా శ్రీ కృషునిని జీవితంలో            మర్మంతో కూడుకున్నది. ఎంత తెలుసుకున్న ఇంకా మిగిలే ఉంటుంది. కొందరికైతే శ్రీ             కృష్ణుని గురుంచి తెలుసుకోవటం, ఇంకా విశ్వం గురించి తెలుసుకోవటం ఒకటే అని                భవిస్తూఉంటారు. 

   🎕    ఈ విశ్వమంతా శ్రీ కృష్ణుని నోటనే ఉన్నది. 

🎕    శిశువుగా శ్రీ కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు. చిన్నతనంలో ఆటను తన ఆనందం కోసం                     చేయదగిన అన్ని అల్లరి పనులు చేసారు కానీ, తన ప్రతి అల్లరి పనిలోనూ స్వలాభాషేక్ష                 లేని ప్రయోజనాలను చూపేవాడు. తన అమాయకత్వముతో చేసిన చిలిపి పనులుగా                         తోచినప్పటికీ, వాటి వెనుక గల అంతరార్థం, పరమాత్ముని లీలలను ప్రదర్శించేవిలా                         ఉండేవి. క్రమంగా తన తల్లికి, తన నోటిలోనే విశ్వాన్ని చూపించి అబ్బురపరచాడు శ్రీ కృష్ణ              భగవానుడు.

🎕    శ్రీ కృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు        తల్లి యశోద కడకు వచ్చి శ్రీ కృషుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేసాడు. మొదట్లో        యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షింపవలసినిదిగా బలరాముడు                సూచించగా యశోద కోపముతో శ్రీ కృష్ణుని ఇంటిలోనికి తీసుకుని వెళ్లి, నోటిని                            పరీక్షింపదలచినది. క్రమంగా నోరు తెరిచినా శ్రీ కృష్ణుని నోట మొత్తం విశ్వమే కాపాడగ,            ఆశ్చర్యానికి లోనైనా యశోద దేవి, దైవాంశ సంభూతునిగా మరియు దేవుని అవతారముగా        గ్రహించింది. కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోద దేవి తల్లిగా ఇక మీదట            ఉండలేదని గ్రహించిన శ్రీ కృష్ణుడు, తన దైవ శక్తితో యశోద దేవి జ్ఞాపకాల నుండి ఈ                సంఘటనని తొలగించివేశాడని చెప్పబడింది. 


🎕    శ్రీ కృష్ణ భగవానుడు, అతని భార్యలు మరియు నారద మునింద్రులు:

       

  • శ్రీ కృష్ణునికి 16108 భార్యలు ఉన్నారని మనకు తెలుసు. అష్టభార్యలు అని పిలవబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందారు. రుక్మిణి కృష్ణునికి మొదటి రాణి.. రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలనీ సంకల్పిస్తాడు. కానీ ఆమె కృషుడిని ప్రేమించిన కారణం ఆ వివాహం నుండి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. శ్రీ కృషుడు అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మిణి ని ఓడించి సగం శిరోముండనం గావించి చంపకుండా వదిలి పెట్టాడని కధనం. నారదముని ద్వారకలో శ్రీ శ్రీ  శ్రీ  కృష్ణుని సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీ కృష్ణుని మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని శ్రీ కృష్ణుని అడుగుతాడు. క్రమంగా శ్రీ కృష్ణుడు తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించిన ఆటను వారిని తన వెంట తీసుకెళ్ళవచ్చును అని షరతు విధించాడు. క్రమంగా శోధించిన నారద మునింద్రుల వారికి ఎ భార్య కూడా ఒంటరిగా కనపడలేదు. అన్నిటా శ్రీ కృష్ణుడె కొలువుతీరి ఉన్నారు. శ్రీ కృష్ణుని లీలగా గ్రహించిన నారద మునింద్రులు, తప్పును క్షమించమని శ్రీ కృష్ణుని వేడుకున్నారు. 

 

           గాంధారి శాపం :

  • మహా భారత యుద్ధం సమయములో శ్రీ కృష్ణ భగవానుడు గాంధారిని ఓదార్చటానికి వెళ్లినప్పుడు తన వంశం మొత్తాన్ని నాశనం చేస్తున్నట్లుగా శ్రీ కృష్ణుని నిందించి, నేటి నుండి ముప్పై ఆరు సంవత్సరాల తరువాత యాదవ వంశం పూర్తిగా నశిస్తుంది. అని శాపమిచ్చింది. ఆలా శ్రీ కృష్ణుడు యుద్దాన్ని అపి తన బిడ్డలా ప్రాణాలు కాపాడడంలో సహాయం చేస్తాడని భావించింది. కానీ ఆలా జరగలేదు. కౌరవ వంశమే తుడిచిపెట్టుకుని పోయింది. అయితే శ్రీ కృష్ణుడు ఆ శాపానికి సమాధానముగా తధాస్తు అని బదులిచ్చినాడు. అనగా ఈ లోకంలో పూర్తిగా పాపలతో నిండిపోయింది, కావున యుగాంతం జరుగక తప్పదు అని శ్రీ కృష్ణుని ఉద్దేశ్యం. 

         శ్రీ కృష్ణ భగవానుడు ఇంకా శిశుపాలుడు 

  •  శిశుపాలుడు ఒక సుప్రసిద్దమైన మరియు చేదు లక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందిన వానిగా ఉన్నాడు. శిశుపాలుని 100 తప్పులు వరకు అతనిని చంపను అని, శిశుపాలుని తల్లికి శ్రీ కృష్ణుడు మాట ఇచ్చిన కారణముగా అతనిని వంద తప్పుల వరకు క్షమించడం జరిగింది. కానీ ఒక సమావేశములో శ్రీ కృష్ణుని పరిపరి విధాలుగా నిందించడం మొదలుపెట్టాడు. శిశుపాలుడు. ప్రతి ఒక నిందను తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీ కృష్ణుడు, 100 తప్పులు పూర్తికాగానే తన సుదర్శన చక్రం తో శిశుపాలుని తలా నరికి వధించాడు. శిశుపాలుడు జరాసంధుడు నిజానికి పూర్వ జన్మలో జయ విజయాలనే విష్ణుని ద్వారపాలకులు. శాపవశాత్తూ మంచి వాళ్ళుగా మూడువందల సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేని వీరు, కృతయుగములో హిరణ్య కశిపుడు - హిరణ్యాక్షడు,త్రేతాయుగములో రవాణా - కుంభకర్ణులు, ఇంకా ద్వాపర యుగములో శిశుపాల - జరాసంధులుగా అవతరమెత్తి త్వరగానే విష్ణుమూర్తి అవతారాల చేతులలోనే సంహరించబడి విశుంవు వద్దకు చేరారని పురాణాల కధనం. 

        శ్రీ కృష్ణుడు ఇంకా ద్రౌపది :

  • మహాభారతంలో అన్న చెల్లెళ్ళ ప్రేమకు నిదర్శనంగా శ్రీ కృష్ణుడు - ద్రౌపదిలను అభివర్ణించబడినది. ద్రౌపది పార్వతీదేవి అంశంగా శ్రీ కృష్ణుడు  విష్ణుమూర్తి అంశంగా చెప్పబడింది. ఇక్కడ విష్ణువు - పార్వతి దేవిలను అన్న చెళ్ళళ్ళుగా పురాణాలలో చెప్పబడింది. 


        ఏకలవ్యునికి శ్రీ కృష్ణుని దీవెనలు: 

  • ద్రోణాచార్యానికి ఏకలవ్యుడు తన బొటనవేలికి అర్పించినప్పుడు, శ్రీ కృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరమిచ్చినట్లుగా ప్రతీతి. క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన దృస్టడీమ్నుడి చేత ద్రోణాచార్యుడు వధించబడ్డాడు. కానీ, మహాభారత యుద్దములో కర్ణుడు, ఏకలవ్యుడు చెల్లెలని పరిణయమాడిన కారణం ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండవలసి వచ్చిందని కధనం.  





Tuesday, 15 July 2025

Bhagavadgita భగవద్గిత సూక్తులు

 

 

మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. 

చావు పుట్టుకలు సహజం ఎవరు తప్పించుకోలేరు వివేకవంతులు వాటి గురుంచి ఆలోచించారు. 

నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భావంతునికి వదిలివేయు. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ ధరి చేరదు. 

కుండలు వేరైనా మట్టి ఒక్కటే నగలు వేరైనా బంగారం ఒకటే ఆవులు వేరైనా పాలు ఒక్కటే అల్లాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్న వాడే జ్ఞానీ 

అందరిలో ఉండేది. ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది. తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. 

మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. 

మరణం అనివార్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఎవరు అమరులు కాదు. 

భగవద్గిత అంటే శవాల దగ్గర పెట్టె పాత కాదు. మనం శవంగా మారేలోపు జీవితపరమార్దాని తెలియజేసి దివ్య జ్ఞానోదదేశం. 

కోపం మనసులో కాదు మాటలో మాత్రమే మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి. 

కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ . వాటి ఫలితాలయందు కాదు. 

అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తానూ ద్వేషించుకోవడమే అవుతుంది.  

కామం,కోపం ఇంకా దురాశ ఈ మూడు నరకానికి మూడు తలుపులు. 

ఈ సృష్టి ని సృష్టించింది నేనే, మధ్యలో ఉన్నది నేనే, ఇంకా ముగించేది కూడా నేనే. 

జరిగినదంతా మన మంచి కోసమే జరిగింది. జరుగుతున్నదంతా మన మంచి కోసం జరుగుతుంది. భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మన మంచి కోసం జరుగుతుంది. 

మార్పు విశ్వం యొక్క నియమం. 

మనిషి తన నమ్మకంతో తయారుతాడు. ఆటను నమ్మిందే తానూ 

ఆశించడం మానేసినప్పుడే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది. 

నువ్వు ఏం చేసిన ఆ చర్యలు శ్రీ కృష్ణుడు ప్రకారమే నేను నీలో ఎప్పుడు ఉంటాను. 

నీ దంటూ ఏది లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్ళలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్ని ఇక్కడే వడిలో వెళ్ళాలి. 

గుర్తుంచుకో .... ఏం జరిగిన అంత మన మంచికే జరుగుతుంది. అని నమ్ము. ఇప్పుడు ఎ జ్జరుజుతుందో అదే మంచికే జరుగుతోంది. భాష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. 

మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరు అమరులు కాదు. 

మానసిక శాంతి చాల ముఖ్యం. కోపం అనేది బ్రమలాంటిది. బుద్దిని ఇబ్బంది పెడుతుంది. 

అతిగా స్పందించడం, అది కోపం, అతి ప్రేమ, అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయములో స్దిరంగా ఉండు. స్దిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం, అతిగా బాధ పడటం రెండు మంచివి కావు. 

స్వార్థం ని వివేకాన్ని చంపేస్తుంది. స్వార్దపరుఁడు తన లాభాలు కోసమే చూస్తాడు. ఇతరులే సంక్షేమ గురుంచి ఆలోచిస్తాడు. 

అన్ని పనులకు మూల్యం చెల్లిచాలాల్సి ఉంటుంది. కర్మ అనుభవించాల్సి ఉంటుంది. అందకే మంచి కర్మలు చేయాలి. 

కర్తవ్యం నిర్వర్తినుంచడంలో సిగ్గుపడకూడదు. మాయిషి తన కర్మల వలన గుర్తింపు సాధిస్తాడు. సరైన పని చేసిన వ్యక్తిని ప్రపంచం కీర్తిస్తుంది. ని కర్తవ్యం నుంచి పారిపోవడం మంచిది కాదు. 

మీరు కేవలం కర్మకు మాత్రమే అర్హులు. దాని ఫలాలు ఎన్నటికీ పొందలేరు. 

కార్య క్రియలో క్రియాసంరాలలో, క్రియాసంతో క్రియాసంరాలలో, కార్యన్మకక్రియాలను చేసే వాడు,మనుష్యులలో తెలివైనవాడు. 

నిస్వార్ధ సేవ ద్వారా మీరు ఎల్లప్పుడూ ఫలప్రదంగా ఉంటారు . మరియు మీ కోరికలను నెరవేర్చగలుగుతాడు. 

అన్నము వలన జంతుజాలం పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సభావమగును. 

ఉత్తములైన వారు దేవి నాచరింతురో, దానినే ఇతరులను ఉత్తములు వీనిని ప్రాణకుగా అంగీకరితులరో లోక మంతయు దిన్నె అనుసరించును. 

పొగచేత అగ్ని మురికి చేయ అద్దము,,మావిచేత శిశువు ఎట్లు కప్పబడునో, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది. 

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమునా అవతారము దాల్చుచున్నాను. 

అనురాగము, భయము,క్రోధము, వదిలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రఇంచిన సత్పురుషులు జ్ఞయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. 

శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థదగును. అట్టి జ్ఞానీ ఉత్కష్టమైన మోక్షమును పొందును. 

ఎవని జ్ఞానము జ్ఞానము చేయ నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. 

గాలి లేని దీపము నిశ్చలముగా ప్రశించులాగుననే మనో ని గ్రహము కలిగి ఆత్మయోగంఅభ్యసించిన వాని చిత్తము నిసకాలముగా నుండును. 

ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నదో, వాడు నేనే చెందున్నాడు. 

రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మతుడు నేనే. 

కామ, క్రోధ,లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక కావున, వానిని వదిలి వేయవలెను. 

జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసన బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. 

Monday, 14 July 2025

sri bhagavad gita saramsam:గీత సారాంశం



నువ్వు ఏమి పోగొట్టుకున్నావు అని అంతలా దుముఖిస్తున్నావు ? 


  • గతమంతా మంచే జరిగింది. 
  • వర్తమానం కూడా మంచే జరుగుతుంది. 
  • భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది. 


  • నువ్వు పోగొట్టు కొన్న దానిని నువ్వు సృష్టించలేదు. నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే. 
  • నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు. నేడు నిధిగా అయిన్ది. రేపు వేరొకరి స్వంతం అవుతుంది. 
  • మార్పు అనేది ప్రకృతి సహజధర్మము . 

  • భగవద్గిత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహకులు కూడా అర్దాలు, అంతరార్దలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక భగవద్గిత సారం అన్న విషయం ఇది వ్రాసేవారికి అర్ధమయినంత, తోచినంత అని గ్రహించాలి. 

  • కర్తవ్య విమూఢడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చు. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక  ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యుని పై వాత్సల్యంతో శ్రీ కృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరేవారికి తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.  


  • ఆత్మ నిత్యా సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు . సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తానూ తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. ఆబ్యాస వైరాగ్యముల ద్వారా యోగీ , వాస్తు ప్రపంచాన్ని వదిలి సర్వోత్క్రష్టమైన పరబ్రహ్మణ్ణి చేరగలడు. భక్తి , కర్మ,ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగంతుని చేరవచ్చును. 

  • మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాందించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతి ఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి. 

  • కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భావంతుని అంశంతోనే ఉన్నాయ్. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునికి చెందుతాయి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీ కృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసిందించాడు. అనంతం, తోజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయినా ఆ శ్రీ కృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు. 

  • ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్టమేగున్నాలచే నిండి ఉన్నాయ్. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాలు బంధంనుండి విముక్తి లభిస్తుంది.